అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో
అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో
Krishna
గిరిజనులు కోరిన ప్రదేశంలోనే సేవాలాల్ పుణ్యక్షేత్రం మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణ పోలీసులు ముందస్తు చర్యగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, పూల్ సింగ్ నాయక్లను అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టులపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ఇలా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడమేనని విమర్శించారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్న నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. గిరిజనుల ఆకాంక్షలను గౌరవించి వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి