Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురుకుల ఫలితాల్లో వెల్లంకి విద్యార్థుల ప్రతిభ వెల్లివిరిసింది స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 12:42 PM

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో
March 25, 2026 11:04 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గిరిజనులు కోరిన ప్రదేశంలోనే సేవాలాల్ పుణ్యక్షేత్రం మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణ పోలీసులు ముందస్తు చర్యగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, పూల్ సింగ్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టులపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ఇలా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడమేనని విమర్శించారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్న నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. గిరిజనుల ఆకాంక్షలను గౌరవించి వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News