అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కారణంగా విద్యార్థులకు అనారోగ్యం ఏర్పడిన విషయం తెలుసుకున్న వెంటనే,వారిని నారాయణఖేడ్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు దీనికి గల కారణాలను పూర్తిగా విచారించి,బాధ్యత వహించాల్సిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యా అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే తమ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగదని, ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.పిల్లలు త్వరగా కోలుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ తల్లిదండ్రులను ధైర్యపరిచారు.ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు,విద్యా అధికారులు, వైద్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి