Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:26 PM

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు
29-12-2025 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు

సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మండలం :

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా కార్యకర్తల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి, ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు.

ఇచ్చిన మాట ప్రకారం సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా వారు ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

గత రెండేళ్లుగా ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో అక్రమ అరెస్టులకు పాల్పడటం అన్యాయమని అన్నారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు తమకు కొత్త కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

Sthanikam

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు

Article Image

చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు

సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మండలం :

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా కార్యకర్తల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి, ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు.

ఇచ్చిన మాట ప్రకారం సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా వారు ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

గత రెండేళ్లుగా ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో అక్రమ అరెస్టులకు పాల్పడటం అన్యాయమని అన్నారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు తమకు కొత్త కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News