Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

అరోరా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి.

అరోరా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి.

అరోరా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి.
February 17, 2026 01:47 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు

యూనివర్సిటీలో గుర్తింపును రద్దు చేయాలని,మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు.సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో ఉన్న అరోరా యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని అరోరా యూనివర్సిటీ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి,ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లావుడియ రాజు రాజు మాట్లాడుతూ...ఎన్ఐటి పేరుతో అడ్మిషన్ తీసుకొని యూనివర్సిటీ జతకట్టినారు,అరోరా యూనివర్సిటీ అడ్మిషన్ సమయంలో ఏఐతో వీడియో చేసి వీడియోలో ఉన్నట్లుగా యూనివర్సిటీలో మాదిగ సదుపాయాలు ఉంటాయని నమ్మించి విద్యార్థుల నుండి 10 నుండి 11లక్షలు పాటు ఫీజులు తీసుకోవడం జరిగింది. విద్యార్థులు యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన తర్వాత విద్యార్థులకు న్యాయం అయిన విద్యార్థులకు వసూలు చేస్తున్నారు,యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేకసార్లు యజమాని దృష్టికి తీసుకెళ్లడానికి చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు,హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైన భోజనం పెట్టాక దానిమీద భోజనం పెట్టక తినే తినకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది,హాస్టల్లో సరిపడా మౌలిక సదుపాయాలు లేక కాలయాపన చేస్తున్నారు,విద్యార్థులతో యూనివర్సిటీ యజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బయట హాస్టల్ నుంచి వస్తున్న విద్యార్థులకు బస్సులను యూనివర్సిటీలో రానీయకుండా రోడ్లమీద ఆపుతున్నారు,యూనివర్సిటీకి సరైన రోడ్లు లేక,ఆట స్థలం లేక యూనివర్సిటీలో ఆడిటోరియం, సెమినార్ హాల్ లేక కాలం గడుపుతున్నారు, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందక విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి నెలకొంది కావున ఉన్నటువంటి యజమాన్యం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని,అధిక ఫీజులు వసూలు చేస్తున్న యూనివర్సిటీపై చర్యలు తీసుకొని యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సుబ్బయ్య డిమాండ్ చేయడం జరిగింది,అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ధర్నా దగ్గరకు వచ్చి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని తెలియజేయడంతో విద్యార్థులు ధర్నా విరమించడం జరిగింది. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్,నాగరాజు,తీగల శ్రీనివాస్,జగన్ నాయక్,ఉదయ్ ,పట్టణ అధ్యక్షులు నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News