Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ

ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ

ఆరోగ్యమే మహాభాగ్యం.  వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ
18-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వేములపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం యోగా కార్యక్రమం, 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, శెట్టిపాలెం సర్పంచ్ పెద్దపంగా సైదులు మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.

2కే రన్ ద్వారా యువతలో ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించడం కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎస్‌కే హాజీ, మాతంగి సుధీర్, వలపట్ల మాధవి రమేష్, బొంగర్ల సుకన్య వినోద్, ఏబీఆర్ యూత్ అధ్యక్షుడు పుట్టల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ

Article Image

మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వేములపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం యోగా కార్యక్రమం, 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, శెట్టిపాలెం సర్పంచ్ పెద్దపంగా సైదులు మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.

2కే రన్ ద్వారా యువతలో ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించడం కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎస్‌కే హాజీ, మాతంగి సుధీర్, వలపట్ల మాధవి రమేష్, బొంగర్ల సుకన్య వినోద్, ఏబీఆర్ యూత్ అధ్యక్షుడు పుట్టల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News