ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ
ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ
Editor Desk
మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వేములపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం యోగా కార్యక్రమం, 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, శెట్టిపాలెం సర్పంచ్ పెద్దపంగా సైదులు మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.
2కే రన్ ద్వారా యువతలో ఫిట్నెస్, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించడం కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎస్కే హాజీ, మాతంగి సుధీర్, వలపట్ల మాధవి రమేష్, బొంగర్ల సుకన్య వినోద్, ఏబీఆర్ యూత్ అధ్యక్షుడు పుట్టల మధు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి