Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

అర్ధరాత్రి దొంగతనం… సూర్యాపేటలో కలకలం

అర్ధరాత్రి దొంగతనం… సూర్యాపేటలో కలకలం

అర్ధరాత్రి దొంగతనం… సూర్యాపేటలో కలకలం
January 09, 2026 01:14 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కిరాణా షాపులో నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దుండగులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు చింతల చెరువు ప్రాంతంలో ఉన్న శ్రీ రామాంజనేయ కిరాణా షాపులో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.

షాపు యజమాని రెగట్టి రాజేష్ గురువారం రాత్రి సుమారు 8.30 గంటలకు దుకాణం మూసి వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు గేటు పైనుంచి లోపలికి ప్రవేశించి,తలుపు గడియ విరగ్గొట్టి షాపులోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లిన దొంగలు కౌంటర్‌లో ఉన్న నగదుతో పాటు,వెనుక గదిలోని సూట్‌కేసులో భద్రపరిచిన 12 గ్రాముల బంగారం,30 తులాల వెండి కడియాలు,మరియు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.ఈరోజు ఉదయం సుమారు 6 గంటలకు షాపు తెరిచి చూడటంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News