Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 AM

ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ప్రతిభా పురస్కారాలను సద్వినియోగం చేసుకోవాలి.కే. జాని రెడ్డి

ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ప్రతిభా పురస్కారాలను సద్వినియోగం చేసుకోవాలి.కే. జాని రెడ్డి

ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ప్రతిభా పురస్కారాలను సద్వినియోగం చేసుకోవాలి.కే. జాని రెడ్డి
May 20, 2026 07:29 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పిల్లలకు అందించే ప్రతిభా పురస్కారాలను సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కే. జాని రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన పిల్లలకు ఆయన ప్రోత్సాహకాలు అందజేశారు. పదవ తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన ఉద్యోగుల, కార్మికుల పిల్లలకు మరియు ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం లో 400 మరియు 900 మార్కులకు పైగా మార్కులు సాధించిన పిల్లలకు శాలువా మరియు మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీ కృష్ణ , గ్యారేజీ ఇన్-చార్జ్ హనుమా నాయక్, కార్యక్రమాన్ని నిర్వహించిన టీజీఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు మరియు డిపో ఉద్యోగులు అత్యధిక మార్కులు సాధించిన పిల్లలు పాల్గొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 1000/990 మార్కులు సాధించిన ఎం.వర్ష, 1000/985 మార్కులు సాధించిన, బి. భాను తేజ, ఇంటర్ ప్రధమ సంవత్సరంలో 470/464 మార్కులు సాధించిన జి.శశాంక్ రెడ్డి, 470/461 మార్కులు సాధించిన డొంకేన నందిని మరియు పదవ తరగతిలో 600/582 మార్కులు సాధించిన ఆర్.సాహితి, 600/570 మార్కులు సాధించిన యంపల్ల రితిక లను మరియు అత్యధిక మార్కులు సాధించిన ఉద్యోగుల పిల్లలను అతిథులు సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News