Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 10:50 PM

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం
March 27, 2026 09:07 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News