ఆర్ఆర్ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం
ఆర్ఆర్ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం
K.RAVI
రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి