Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం
27-03-2026 265 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

Article Image

రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News