Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ
April 02, 2026 07:38 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యమని 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి తెలిపారు.గురువారం పురపాలక పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డులో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వార్డు సభలు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయని చెప్పారు.సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, మహిళా శక్తి, రైతు భరోసా, మహిళా సంఘాల వడ్డీ రుణాల వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారుల పేర్లను వార్డు ప్రత్యేక అధికారి సంతోష్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నె శివా రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, పుర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్లెం దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, నాయకులు యాదయ్య, క్రాంతి, నవీన్ యాదవ్, అంజయ్య, సునీల్, బాల మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News