Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ
02-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యమని 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి తెలిపారు.గురువారం పురపాలక పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డులో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వార్డు సభలు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయని చెప్పారు.సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, మహిళా శక్తి, రైతు భరోసా, మహిళా సంఘాల వడ్డీ రుణాల వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారుల పేర్లను వార్డు ప్రత్యేక అధికారి సంతోష్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నె శివా రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, పుర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్లెం దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, నాయకులు యాదయ్య, క్రాంతి, నవీన్ యాదవ్, అంజయ్య, సునీల్, బాల మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ పథకాలు… వార్డు సభలో స్పష్టీకరణ

Article Image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యమని 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి తెలిపారు.గురువారం పురపాలక పరిధిలోని లింగోజిగూడెం 3వ వార్డులో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వార్డు సభలు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయని చెప్పారు.సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, మహిళా శక్తి, రైతు భరోసా, మహిళా సంఘాల వడ్డీ రుణాల వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారుల పేర్లను వార్డు ప్రత్యేక అధికారి సంతోష్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నె శివా రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, పుర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్లెం దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, నాయకులు యాదయ్య, క్రాంతి, నవీన్ యాదవ్, అంజయ్య, సునీల్, బాల మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News