Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:19 AM

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి.సీపీఎం.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి.సీపీఎం.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి.సీపీఎం.
June 07, 2026 11:56 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రామన్నపేట పట్టణ కమిటీ సమావేశం శనివారం రాత్రి గాదె నరేందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామసభల్లో సుమారు 400 మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పద్మశాలి కాలనీలో నూతన మంచినీటి ట్యాంకు నిర్మించాలని, సాకరికుంట నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వరద కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. 14వ వార్డులో కోర్టు కాలనీ నుంచి పెద్దమోరీ వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సూచించారు.

నేతాజీ క్లబ్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా వాటర్ ప్లాంట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు భావడ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, గొరిగే సోములు, సీఐటీయూ నాయకులు పల్లె సత్యం, ఆముదాల ఆంజనేయులు, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, కుందూరు వెంకటేశ్, రాసాల రమేష్, అప్పం సంతోష్, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News