అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామాన్ని శనివారం ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ స్థితిని ఆమె సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వం ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ కీలకమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సారగ్, బిఎల్ఓ సూపర్వైజర్ రాంచందర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్, గ్రామ బిఎల్ఓ సునీత, విజయలక్ష్మి, సుందరమ్మ , పాటు ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికల ఏర్పాట్లను విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి