Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి
28-03-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణం ఈ వేసవిలో విద్యుత్ అంతరాయాలతో అల్లాడుతోంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వేళల్లో అరగంటకోసారి కరెంటు రావడం–పోవడం జరుగుతుండటంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత వేడి మధ్య విద్యుత్ లేక ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్కసారి కరెంటు వస్తే మరికొద్దిసేపటికే మళ్లీ వెళ్లిపోవడం రోజువారీగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వ్యాపారవేత్తలు కూడా నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు.ఇక విద్యుత్ శాఖ అధికారులు మాత్రం “బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది” అని చెబుతున్నారు. అయితే సమస్య ఎప్పటికప్పుడు పునరావృతం కావడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో విద్యుత్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. నిరంతర సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Sthanikam

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

Article Image

చిట్యాల పట్టణం ఈ వేసవిలో విద్యుత్ అంతరాయాలతో అల్లాడుతోంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వేళల్లో అరగంటకోసారి కరెంటు రావడం–పోవడం జరుగుతుండటంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత వేడి మధ్య విద్యుత్ లేక ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్కసారి కరెంటు వస్తే మరికొద్దిసేపటికే మళ్లీ వెళ్లిపోవడం రోజువారీగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వ్యాపారవేత్తలు కూడా నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు.ఇక విద్యుత్ శాఖ అధికారులు మాత్రం “బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది” అని చెబుతున్నారు. అయితే సమస్య ఎప్పటికప్పుడు పునరావృతం కావడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో విద్యుత్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. నిరంతర సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News