Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 02:45 AM

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి
March 28, 2026 12:24 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణం ఈ వేసవిలో విద్యుత్ అంతరాయాలతో అల్లాడుతోంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వేళల్లో అరగంటకోసారి కరెంటు రావడం–పోవడం జరుగుతుండటంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత వేడి మధ్య విద్యుత్ లేక ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్కసారి కరెంటు వస్తే మరికొద్దిసేపటికే మళ్లీ వెళ్లిపోవడం రోజువారీగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వ్యాపారవేత్తలు కూడా నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు.ఇక విద్యుత్ శాఖ అధికారులు మాత్రం “బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది” అని చెబుతున్నారు. అయితే సమస్య ఎప్పటికప్పుడు పునరావృతం కావడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో విద్యుత్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. నిరంతర సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News