ఆర్గానిక్ రైతోత్సవంను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మి షా
ఆర్గానిక్ రైతోత్సవంను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మి షా
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా:అరుణ్
ఎ.కొండూరు (మం) కృష్ణారావుపాలెం లో ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా ఆర్గానిక్ రైతోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్,జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశా..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మి షా మాట్లాడుతూ అనేకమంది రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. అదే విధంగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు కానీ ఇద్దరి మద్యలో దూరం ఏర్పడుతుంది.రైతులకుసాంకేతికపరంగా అభివృద్ధి చేసి మార్కెట్ పరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు కానుంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సాధికారక సంస్థ ఆర్గానిక్ వ్యవసాయం పైనే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వేదికల పైన ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అందరూ సహకారంతో జిల్లాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.రైతులకు అన్ని విధాలుగా ఆర్గానిక్ పంటలపై అవగాహనతో పాటు టెక్నాలజీ ఎలా సద్విని చేసుకోవాలని,పండించిన పంటలు ఎలా విక్రయించుకోవాలి అనేదానిపై ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం నేడు ఇక్కడతో పాటు రేపు విజయవాడ జరుగునుంది. రేపు విజయవాడలో వినియోగదారులతో పాటు గ్రేటర్ కమ్యూనిటీ సైంటిస్టులను కూడా హాజరవుతున్నారు. రైతుల పండించిన పంటలు ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఎలా విక్రయించుకోవాలి అనేది సమావేశం జరుగుతుంది.
మీడియానే మొదటి అంబాసిడర్లను ఆర్గానిక్ పంటలను ప్రమోట్ చేసే బాధ్యత పాత్రికేయులుదే అన్నారు.
భవిష్యత్తులో ఆర్గానిక్ ఆహారమే గేమ్ చేంజర్ గా మారనుంది..ఇప్పటికీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని మరి కొంచెం కష్టపడితే జిల్లా కూడా ప్రథమ స్థానంలో వస్తుంది.. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ శా అన్నారు.ఆర్గానిక్ వ్యవసాయం ఇంటర్ ఫ్యునర్ గా ఉందని యంగ్ జనరేషన్ ను మోటివేషన్ చేస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో అధికారులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి