Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:22 AM

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య
05-01-2026 235 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులు రైతులకు తీవ్ర తలనొప్పిగా మారాయని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెన అర్ధాంతరంగా ఉండటంతో అది ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.కాల్వ మీద నిర్మించిన కల్వర్టును సుమారు మీటర్ లోతులో ఏర్పాటు చేయడం వల్ల లోడ్ ట్రాక్టర్లు, వరి ధాన్యాలు తరలించే వాహనాలు రోడ్డు ఎక్కలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే కల్వర్టులో నీరు నిల్వ ఉండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ఐపీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో స్పష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారని ముత్తయ్య వెల్లడించారు. దీని వల్ల గ్రామీణ రహదారిపై వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఈ పరిస్థితికి వెంటనే పరిష్కారం చూపాలని, పెద్ద కాపర్తి–సిరిపురం రోడ్డుపై రెండు లైన్ల కల్వర్టును నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

Article Image
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులు రైతులకు తీవ్ర తలనొప్పిగా మారాయని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెన అర్ధాంతరంగా ఉండటంతో అది ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.కాల్వ మీద నిర్మించిన కల్వర్టును సుమారు మీటర్ లోతులో ఏర్పాటు చేయడం వల్ల లోడ్ ట్రాక్టర్లు, వరి ధాన్యాలు తరలించే వాహనాలు రోడ్డు ఎక్కలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే కల్వర్టులో నీరు నిల్వ ఉండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ఐపీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో స్పష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారని ముత్తయ్య వెల్లడించారు. దీని వల్ల గ్రామీణ రహదారిపై వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఈ పరిస్థితికి వెంటనే పరిష్కారం చూపాలని, పెద్ద కాపర్తి–సిరిపురం రోడ్డుపై రెండు లైన్ల కల్వర్టును నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News