అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య
అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులు రైతులకు తీవ్ర తలనొప్పిగా మారాయని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెన అర్ధాంతరంగా ఉండటంతో అది ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.కాల్వ మీద నిర్మించిన కల్వర్టును సుమారు మీటర్ లోతులో ఏర్పాటు చేయడం వల్ల లోడ్ ట్రాక్టర్లు, వరి ధాన్యాలు తరలించే వాహనాలు రోడ్డు ఎక్కలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే కల్వర్టులో నీరు నిల్వ ఉండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ఐపీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో స్పష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారని ముత్తయ్య వెల్లడించారు. దీని వల్ల గ్రామీణ రహదారిపై వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఈ పరిస్థితికి వెంటనే పరిష్కారం చూపాలని, పెద్ద కాపర్తి–సిరిపురం రోడ్డుపై రెండు లైన్ల కల్వర్టును నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి