Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య
January 05, 2026 12:16 PM 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులు రైతులకు తీవ్ర తలనొప్పిగా మారాయని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెన అర్ధాంతరంగా ఉండటంతో అది ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.కాల్వ మీద నిర్మించిన కల్వర్టును సుమారు మీటర్ లోతులో ఏర్పాటు చేయడం వల్ల లోడ్ ట్రాక్టర్లు, వరి ధాన్యాలు తరలించే వాహనాలు రోడ్డు ఎక్కలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే కల్వర్టులో నీరు నిల్వ ఉండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ఐపీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో స్పష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారని ముత్తయ్య వెల్లడించారు. దీని వల్ల గ్రామీణ రహదారిపై వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఈ పరిస్థితికి వెంటనే పరిష్కారం చూపాలని, పెద్ద కాపర్తి–సిరిపురం రోడ్డుపై రెండు లైన్ల కల్వర్టును నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News