ఆర్డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు
ఆర్డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి/పెనుకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) సంస్థకు సంబంధించిన ఎఫ్ సి ఆర్ ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ) లైసెన్స్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2024కు ముందు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.
ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో ప్రస్తావించారు. వారి చొరవతో లైసెన్స్ పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పెనుకొండలో అన్నా క్యాంటీన్, టీడీపీ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి