అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది
అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది
Komidala Mahender reddy
నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఘర్షన చికిత్స పొందుతూ శంభులింగం మృతి
నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అప్పు వసూళ్ల విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు శంభులింగం (60)పై అదే గ్రామానికి చెందిన సుర ఆంజనేయులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పు లావాదేవీల విషయమై ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఆంజనేయులు శంభులింగంపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో శంభులింగానికి ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.గాయపడిన శంభులింగాన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, గతంలో పెద్దమనుషుల సమక్షంలో రూ.80 వేల అప్పు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు రావాల్సి ఉందని చెప్పి ఇంటికి పిలిచి సుర ఆంజనేయులు దాడి చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేసుల్లో కూడా సుర ఆంజనేయులుపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి