Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది

అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది

అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది
March 11, 2026 11:28 AM 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఘర్షన చికిత్స పొందుతూ శంభులింగం మృతి

నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అప్పు వసూళ్ల విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు శంభులింగం (60)పై అదే గ్రామానికి చెందిన సుర ఆంజనేయులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పు లావాదేవీల విషయమై ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఆంజనేయులు శంభులింగంపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో శంభులింగానికి ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.గాయపడిన శంభులింగాన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, గతంలో పెద్దమనుషుల సమక్షంలో రూ.80 వేల అప్పు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు రావాల్సి ఉందని చెప్పి ఇంటికి పిలిచి సుర ఆంజనేయులు దాడి చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గ్రామంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేసుల్లో కూడా సుర ఆంజనేయులుపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News