అనురాగ్ రెడ్డి వివాహ విందు కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
అనురాగ్ రెడ్డి వివాహ విందు కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
Krishna
నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని మహా ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన అనురాగ్ రెడ్డి వివాహ విందు కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల నాయకులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహానంతర విందులో పాల్గొన్న అతిథులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొని దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో కుటుంబం మరింత ముందుండాలని ఆకాంక్షిస్తూ నాయకులు ఆశీస్సులు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి