అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలకు అవకాశం ఇవ్వకూడదు
అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలకు అవకాశం ఇవ్వకూడదు
Biksham
పాఠశాల ఎదుట ధర్నా, కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ
అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మార్చుకుని తల్లిదండ్రులను దోచుకుంటున్న కార్పొరేట్ పాఠశాలలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
పట్టణంలోని ఓ ప్రైవేట్ భవనంలో నడుస్తున్న పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నంబర్ 346లో ఉన్న భవనంలో కార్పొరేట్ పాఠశాల పేరుతో విచ్చలవిడిగా ప్రవేశాలు తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కంటికి కనిపించే ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించి విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. సరైన రహదారి, మౌలిక వసతులు లేకుండా పాఠశాలను నడపడం ప్రమాదకరమని పేర్కొన్నారు.
అటువంటి పాఠశాలలకు అనుమతులు ఇవ్వకూడదని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బోనగిరి సతీష్, మడిపల్లి సాయి, లోకేష్, సాయి, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి