Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

అనుమతులు లేకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం:హద్నూర్ పోలీస్ అధికారులు

అనుమతులు లేకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం:హద్నూర్ పోలీస్ అధికారులు

అనుమతులు లేకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం:హద్నూర్ పోలీస్ అధికారులు
January 16, 2026 07:49 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రభుత్వ పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నేడు ఉదయం సుమారు పది గంటల సమయంలో, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ బియ్యాన్ని విక్రయించేందుకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో చల్కి చౌరస్తా వద్ద ఒక ఆటోను ఆపి సోదాలు నిర్వహించగా, అందులో సుమారు ఐదు క్వింటాళ్ల ప్రభుత్వ పంపిణీ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని విచారించగా, అతడు నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామానికి చెందిన జాదవ్ పరశురాం, తండ్రి లక్ష్మణ్, వయస్సు నలభై సంవత్సరాలు, లంబాడా కులానికి చెందినవాడని గుర్తించారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు అతడు అంగీకరించాడు.ఈ సంఘటనపై అధికారులు వెంటనే పంచనామ నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తిపై చట్టబద్ధంగా కేసు నమోదు చేసి, తదుపరి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.ప్రభుత్వ పేదల ఆహార భద్రత కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా తరలించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపశమనం ఉండదని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కూడా తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వారి సమాచారం అధికారులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News