అనంతపురం లో 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
అనంతపురం లో 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
GADDAM JAGANMOHAN REDDY
1100 కాల్ సెంటర్ వినియోగించుకోండి.
అనంతపురం, జిల్లా ప్రజలు “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రజలు దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాలేదా? లేదా తమ ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవాలా? అయితే 1100 నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
అలాగే కొత్తగా అర్జీలు నమోదు చేసుకోవాలనుకునే వారు https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సేవలను వినియోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని ప్రజలను కోరారు.
23న పీజీఆర్ఎస్ కార్యక్రమం
ఈనెల 23వ తేదీ సోమవారం అనంతపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.
అర్జీదారులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన రసీదు లేదా స్లిప్పును తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత మొబైల్కు ఎస్ఎంఎస్ సందేశం వస్తుందని, ఫోన్ను పరిశీలించాలని తెలిపారు.
నోటీసులు, ఎండార్స్మెంట్లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నామని, అవసరమైతే రిజిస్టర్డ్ పోస్టు ద్వారా చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీలు స్పష్టంగా, పూర్తి వివరాలతో నింపాలని, రిపీట్ అర్జీలు ఇస్తున్న వారు పాత రసీదును తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి