Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:41 AM

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి
December 18, 2025 07:13 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

ప్రజల భద్రతకే పోలీసుల సైబర్ అవగాహన చర్యలు: ఎస్పీ పారితోష్ పంకజ్

సంగారెడ్డి, జిల్లా స్థానికం ప్రతినిధి

సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించేందుకు పోలీసు శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ఏ పోలీసు అధికారి కూడా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరని, అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే వ్యవస్థే లేదని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

అదేవిధంగా నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పుతూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

సైబర్ నేరస్తులు పన్నే మోసపూరిత ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News