అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు
అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రానికి చెందిన స్నేహితుడు సంజీవులు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కష్టసమయంలో మన స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదని, అతనికి మన వంతు సహాయం అందించాలని భావించిన మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచ్ పదో తరగతి స్నేహితులు అందరూ ఒక్కటై, మంచి మనసుతో ముందుకు వచ్చారు.మన స్నేహబంధానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి, మొత్తం రూ.21,700/- ఆర్థిక సాయాన్ని సంజీవులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మానసికంగా కూడా అండగా నిలిచాము.స్నేహం అంటే మాటలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో తోడుగా నిలబడడమే అని మరోసారి నిరూపించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి 10వ తరగతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మన స్నేహం ఇలానే ఎప్పటికీ నిలవాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి