PRINT TIME: April 11, 2026 08:31 AM
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
December 31, 2025 12:49 PM
80 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.
అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి