అన్నదానం చేయడం మహాదానము అని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం
కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రామాలయ ఆలయ ఆవరణలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో అన్నదాత మల్లెల శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్,మాజీ ఎంపిపి మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ పీఏసిఎస్ మాజీ చైర్మన్ నంబూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి