Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:11 PM

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఆందోళన అఖిల భారత మెడికల్ షాప్ బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ సంపూర్ణ మద్దతు

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఆందోళన అఖిల భారత మెడికల్ షాప్ బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ సంపూర్ణ మద్దతు

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఆందోళన అఖిల భారత మెడికల్ షాప్ బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ సంపూర్ణ మద్దతు
May 20, 2026 04:51 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరుగుతుండటం, భారీ తగ్గింపు ధరలతో ఔషధాల అమ్మకాలు జరగడం వల్ల చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపునిచ్చిన అల్ ఇండియా మెడికల్ షాపుల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

ఈ సందర్భంగా టీఎంఎస్‌ఆర్‌యూ నాయకులు మాట్లాడుతూ, ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలు సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికికే ముప్పుగా మారాయని పేర్కొన్నారు. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడం వల్ల స్థానిక మెడికల్ షాపులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో అనేక దుకాణాలు ఆర్థికంగా నష్టపోయి మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో విక్రయించే మందుల నాణ్యత, భద్రతపై కూడా అనేక సందేహాలు ఉన్నాయని నాయకులు తెలిపారు. వైద్యుల సలహా లేకుండా మందులు సులభంగా అందుబాటులోకి రావడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల వినియోగం పెరిగితే దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే చిన్న మెడికల్ షాపులను రక్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని, భారీ డిస్కౌంట్‌ల పేరుతో జరుగుతున్న అన్యాయ పోటీని అరికట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ ఉద్యమం మెడికల్ షాపుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, నిరంజన్, పోలా రమేష్ పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి స్వామి, అధ్యక్షుడు హరిప్రసాద్, కోశాధికారి జీవన్, ఉప కార్యదర్శి నరేంద్ర, ఉపాధ్యక్షుడు అనిల్, కమిటీ సభ్యులు శ్రీహరి తదితరులు హాజరై బంద్‌కు సంఘీభావం తెలిపారు. నాయకులు మాట్లాడుతూ మెడికల్ షాపుల పరిరక్షణ కోసం అవసరమైతే మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News