అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం
అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం
Editor Desk
భువనగిరి స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
భూవనగిరి మండలం, అనాజిపురం: గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి రాయపురం సురేష్ (కత్తెర గుర్తు)ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, గ్రామ ఎన్నికల అబ్జర్వర్ పడిగెల ప్రదీప్ పిలుపునిచ్చారు.
వారు గురువారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్లు ఏదునూరి మల్లేశం, గుణగుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేతలు మాట్లాడుతూ—
గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు.
వీటిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం సరఫరా, రైతులకు ఋణమాఫీ, పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఉన్నాయని తెలిపారు.
గ్రామంలో కూడా హెచ్ఎండిఎ నిధులతో సీసీ రోడ్లు, మురికివాడలో చెక్డ్యామ్ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే కాంగ్రెస్–సీపీఎం అభ్యర్థులను విజయం సాధించాలన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి