Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం

అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం

అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం
December 11, 2025 05:22 AM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


భువనగిరి స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భూవనగిరి మండలం, అనాజిపురం: గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి రాయపురం సురేష్ (కత్తెర గుర్తు)ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, గ్రామ ఎన్నికల అబ్జర్వర్ పడిగెల ప్రదీప్ పిలుపునిచ్చారు.

వారు గురువారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌లు ఏదునూరి మల్లేశం, గుణగుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేతలు మాట్లాడుతూ—

గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు.



వీటిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం సరఫరా, రైతులకు ఋణమాఫీ, పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఉన్నాయని తెలిపారు.

గ్రామంలో కూడా హెచ్ఎండిఎ నిధులతో సీసీ రోడ్లు, మురికివాడలో చెక్‌డ్యామ్ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే కాంగ్రెస్–సీపీఎం అభ్యర్థులను విజయం సాధించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News