Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:07 AM

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా
January 13, 2026 08:35 PM 2,634 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చిన ప్లెక్సీలు.. విద్యార్థిని మృతి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా ర్యాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువు పూర్తి చేసి, ప్రస్తుతం బాసరలోని ట్రిపుల్ ఐటీలో (IIIT) ఉన్నత చదువులు కొనసాగిస్తోంది.సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నారాయణఖేడ్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం పరిధిలోని వైకుంఠపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ప్లెక్సీలు తరలిస్తున్న ఒక ఆటో ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్లెక్సీల సీకు ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పూజా అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగకు ఇంటికి వస్తూ మృతి చెందడం గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.పూజా మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యలో ప్రతిభావంతురాలిగా పేరొందిన పూజా అకాల మరణం తీరని లోటుగా మారింది.

మీ స్పందన? 8 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News