అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా
అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా
Sthanikam District Staff Reporter krishna
ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చిన ప్లెక్సీలు.. విద్యార్థిని మృతి
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా ర్యాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువు పూర్తి చేసి, ప్రస్తుతం బాసరలోని ట్రిపుల్ ఐటీలో (IIIT) ఉన్నత చదువులు కొనసాగిస్తోంది.సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నారాయణఖేడ్కు ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం పరిధిలోని వైకుంఠపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ప్లెక్సీలు తరలిస్తున్న ఒక ఆటో ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్లెక్సీల సీకు ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పూజా అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగకు ఇంటికి వస్తూ మృతి చెందడం గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.పూజా మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యలో ప్రతిభావంతురాలిగా పేరొందిన పూజా అకాల మరణం తీరని లోటుగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి