Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం
December 27, 2025 06:18 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్ల విధ్వంసం – ప్రజల సహనానికి పరీక్ష

సూర్యాపేట, స్థానిక ప్రతినిధి:

సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టి నెలల తరబడి వదిలేయడం ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 9వ వార్డులో పగలగొట్టిన రోడ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పైపులు వేసిన కాంట్రాక్టర్లు రోడ్ల పునర్నిర్మాణం చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

రోడ్లు గుంతలుగా మారడంతో వృద్ధులు, పిల్లలు, వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల ఓట్లు తప్ప సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట పగలగొట్టిన రోడ్లను పూడ్చి కొత్త రోడ్లు వేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్, నల్ల మేకల రామ్‌కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News