Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:24 PM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం
December 27, 2025 06:18 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్ల విధ్వంసం – ప్రజల సహనానికి పరీక్ష

సూర్యాపేట, స్థానిక ప్రతినిధి:

సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టి నెలల తరబడి వదిలేయడం ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 9వ వార్డులో పగలగొట్టిన రోడ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పైపులు వేసిన కాంట్రాక్టర్లు రోడ్ల పునర్నిర్మాణం చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

రోడ్లు గుంతలుగా మారడంతో వృద్ధులు, పిల్లలు, వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల ఓట్లు తప్ప సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట పగలగొట్టిన రోడ్లను పూడ్చి కొత్త రోడ్లు వేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్, నల్ల మేకల రామ్‌కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News