Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:34 PM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం
December 27, 2025 06:18 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్ల విధ్వంసం – ప్రజల సహనానికి పరీక్ష

సూర్యాపేట, స్థానిక ప్రతినిధి:

సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టి నెలల తరబడి వదిలేయడం ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 9వ వార్డులో పగలగొట్టిన రోడ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పైపులు వేసిన కాంట్రాక్టర్లు రోడ్ల పునర్నిర్మాణం చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

రోడ్లు గుంతలుగా మారడంతో వృద్ధులు, పిల్లలు, వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల ఓట్లు తప్ప సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట పగలగొట్టిన రోడ్లను పూడ్చి కొత్త రోడ్లు వేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్, నల్ల మేకల రామ్‌కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News