Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:52 AM

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
January 03, 2026 06:05 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, జనవరి 3: స్థానికం ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

“సుస్థిర అభివృద్ధి కోసం వ్యాపార పరివర్తన” అంశంపై ఈ జాతీయ సదస్సు మార్చి 13, 14 తేదీల్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనుంది. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొననున్నారు.

సదస్సులో సుస్థిరత కోసం డిజిటల్ పరివర్తన, ఫిన్‌టెక్–సస్టైనబుల్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, సస్టైనబుల్ రిటైలింగ్, సరఫరా గొలుసు, సస్టైనబుల్ మానవ మూలధనం–న్యాయకత్వం, హెల్త్‌కేర్ సేవలు, సస్టైనబుల్ వ్యాపార నమూనాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, డా. రాధాకృష్ణ, డా. బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News