Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:27 AM

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
03-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, జనవరి 3: స్థానికం ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

“సుస్థిర అభివృద్ధి కోసం వ్యాపార పరివర్తన” అంశంపై ఈ జాతీయ సదస్సు మార్చి 13, 14 తేదీల్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనుంది. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొననున్నారు.

సదస్సులో సుస్థిరత కోసం డిజిటల్ పరివర్తన, ఫిన్‌టెక్–సస్టైనబుల్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, సస్టైనబుల్ రిటైలింగ్, సరఫరా గొలుసు, సస్టైనబుల్ మానవ మూలధనం–న్యాయకత్వం, హెల్త్‌కేర్ సేవలు, సస్టైనబుల్ వ్యాపార నమూనాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, డా. రాధాకృష్ణ, డా. బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

Article Image
హైదరాబాద్, జనవరి 3: స్థానికం ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

“సుస్థిర అభివృద్ధి కోసం వ్యాపార పరివర్తన” అంశంపై ఈ జాతీయ సదస్సు మార్చి 13, 14 తేదీల్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనుంది. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొననున్నారు.

సదస్సులో సుస్థిరత కోసం డిజిటల్ పరివర్తన, ఫిన్‌టెక్–సస్టైనబుల్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, సస్టైనబుల్ రిటైలింగ్, సరఫరా గొలుసు, సస్టైనబుల్ మానవ మూలధనం–న్యాయకత్వం, హెల్త్‌కేర్ సేవలు, సస్టైనబుల్ వ్యాపార నమూనాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, డా. రాధాకృష్ణ, డా. బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News