అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
Editor Desk
హైదరాబాద్, జనవరి 3: స్థానికం ప్రతినిధి
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్ను వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.
“సుస్థిర అభివృద్ధి కోసం వ్యాపార పరివర్తన” అంశంపై ఈ జాతీయ సదస్సు మార్చి 13, 14 తేదీల్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనుంది. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొననున్నారు.
సదస్సులో సుస్థిరత కోసం డిజిటల్ పరివర్తన, ఫిన్టెక్–సస్టైనబుల్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, సస్టైనబుల్ రిటైలింగ్, సరఫరా గొలుసు, సస్టైనబుల్ మానవ మూలధనం–న్యాయకత్వం, హెల్త్కేర్ సేవలు, సస్టైనబుల్ వ్యాపార నమూనాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, డా. రాధాకృష్ణ, డా. బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి