Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:52 AM

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ
January 01, 2026 03:30 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తశుద్ధితో పనిచేసి యూనివర్సిటీ కి మంచి పేరు తీసుకురావాలి: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

స్థానికం ప్రతినిధి జూబ్లీహిల్స్:

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ మరియు డైరీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఘనంగా ఆవిష్కరించారు. గురువారం యూనివర్సిటీ జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

నాణ్యమైనవిద్యే లక్ష్యం: ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఉద్యోగులందరూ మరింత జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అధ్యాపక, అధ్యపకేతర సిబ్బందికి, విద్యార్థులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

వీసీ, రిజిస్ట్రార్లకు ఘన సన్మానం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు గాను, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిని, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డిని ఘనంగా సన్మానించారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, హెడ్లు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాంతం ప్రేమ్ కుమార్, ఎన్.సి. వేణుగోపాల్, విశ్వనాథ్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా మరియు ఇతర సిబ్బంది ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News