Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 AM

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ
January 01, 2026 03:30 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తశుద్ధితో పనిచేసి యూనివర్సిటీ కి మంచి పేరు తీసుకురావాలి: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

స్థానికం ప్రతినిధి జూబ్లీహిల్స్:

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ మరియు డైరీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఘనంగా ఆవిష్కరించారు. గురువారం యూనివర్సిటీ జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

నాణ్యమైనవిద్యే లక్ష్యం: ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఉద్యోగులందరూ మరింత జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అధ్యాపక, అధ్యపకేతర సిబ్బందికి, విద్యార్థులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

వీసీ, రిజిస్ట్రార్లకు ఘన సన్మానం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు గాను, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిని, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డిని ఘనంగా సన్మానించారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, హెడ్లు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాంతం ప్రేమ్ కుమార్, ఎన్.సి. వేణుగోపాల్, విశ్వనాథ్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా మరియు ఇతర సిబ్బంది ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News