PRINT TIME: July 11, 2026 02:37 AM
అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర అవతరణ వేడుకలు.
అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర అవతరణ వేడుకలు.
June 02, 2026 11:33 AM
43 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆ మూడు అంశాలకు ప్రాధాన్యత కల్పించినప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి