అమరవీరుని ఆశయాలకు వారసత్వం – సమాజ సేవలోకి అడుగుపెట్టిన కూతురు
అమరవీరుని ఆశయాలకు వారసత్వం – సమాజ సేవలోకి అడుగుపెట్టిన కూతురు
Biksham
సూర్యాపేట:
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన తండ్రి ఆశయాలను సమాజ సేవ ద్వారా కొనసాగించాలనే సంకల్పంతో కూతురు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన హృదయస్పర్శి ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో చోటుచేసుకుంది.కార్గిల్ యుద్ధంలో శత్రు తుపాకీ గుండుకు బలై దేశానికి అమరుడైన వీరసైనికుడు పోలోజు గోపయ్య చారి చేసిన త్యాగం నేటికీ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ అమరవీరుని ఏకైక కూతురు పోలోజు మౌనిక, తండ్రి చూపిన సేవా మార్గాన్నే అనుసరిస్తూ సమాజ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.46వ వార్డు అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, యువత మరియు మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తోంది.దేశం కోసం తండ్రి చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజ సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 46వ వార్డు ప్రజలను మౌనిక విజ్ఞప్తి చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి