Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:05 PM

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం
February 18, 2026 11:39 AM 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బోరంచ గ్రామంలో పవిత్రమైన మంజీర నది ఒడ్డున వెలసిన నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో భక్తి భావంతో ఒక విశేష కార్యక్రమం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో తూమ్నూర్ గ్రామానికి పాతులాబోగూడా రమేష్ దంపతులు అమ్మవారిపై తమ అచంచల విశ్వాసం, భక్తిని వ్యక్తం చేస్తూ ఆలయానికి ఆరు ఫ్యాన్లు విరాళంగా సమర్పించారు. ఆలయ సౌకర్యాల అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. భక్తులు ఆలయ సేవలో భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయం.వారు అందించిన ఫ్యాన్లను ఆలయ చైర్మన్ బెల్లాపురం మల్లన్న మరియు అర్చకులు సిద్ధయ్య స్వామి స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్వామి రమేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి సేవలో భాగంగా చేసిన ఈ దానం వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని, వారి కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని ఆలయ వర్గాలు మరియు గ్రామస్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News