Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

అమ్మ–బిడ్డకు అండగా… యాదాద్రిలో 102 అమ్మఒడి సేవలు

అమ్మ–బిడ్డకు అండగా… యాదాద్రిలో 102 అమ్మఒడి సేవలు

అమ్మ–బిడ్డకు అండగా… యాదాద్రిలో 102 అమ్మఒడి సేవలు
December 08, 2025 01:18 PM 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆరు వాహనాలతో జిల్లావ్యాప్తంగా వేగవంతమైన స్పందన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా:

గర్భిణీ, బాలింతల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న 102 అమ్మఒడి వాహనాలు యాదాద్రి జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గర్భం వచ్చిన మొదటి నెల నుంచే… కాన్పు అయ్యే వరకు… కాన్పు అనంతరం ఇంటి దాకా… ప్రతి దశలో అమ్మఒడి భద్రతగా నిలుస్తోంది.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆరు 102 వాహనాలు పనిచేస్తూ, ఎప్పటికప్పుడు కాల్‌ వచ్చిన వెంటనే స్పందిస్తూ గర్భిణీలను ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఆంటీ నేటల్ చెకప్‌లకు వెళ్లేవారికి, కాన్పు తరువాత ఇంటికి చేరేవారికి కూడా ఇదే ప్రధాన ఆధారం.

మాత–శిశు మరణాలు తగ్గుదలకు పురోగమనమే

ప్రతి నెల జరిగే గర్భిణీల పరీక్షలకు వారి ఇళ్లనుంచి ఆరోగ్య కేంద్రాల దాకా సురక్షితంగా తరలించడం వల్లరక్తహీనత వంటి సమస్యలు ముందుగానే గుర్తించడంశిశువు గర్భంలో కదలికలు సరిగా ఉన్నాయా తెలుసుకోవడంప్రమాద సూచనలపై వెంటనే వైద్యపర్యవేక్షణసాధ్యమవుతున్నాయని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.ఇది మాత–శిశు మరణాల రేటు తగ్గడానికి దారితీస్తోందని వారు పేర్కొన్నారు.

ఆశవర్కర్ల అవగాహనతో సేవలు మరింత చేరువ

ఆశ వర్కర్లు ప్రతి గర్భిణీ వివరాలను నమోదు చేసి, 102 వాహన సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షలు, టీకాలు, ఫాలోఅప్‌ చెక్‌ప్‌లకు తరలించడంలో అమ్మఒడి వాహనాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

అధికారుల మాటల్లో…

102 ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం

“ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలున్నాయి. గర్భిణీలు అమ్మఒడి సేవలను వినియోగించడం ద్వారా సురక్షిత ప్రసవాలు జరుగుతున్నాయి.”

102 జిల్లాఇన్‌చార్జ్ ధూపాటి మహేష్‌కుమార్

“వాహనాల అందుబాటు పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రజల్లో నమ్మకం పెరిగింది.”

102 వాహన కెప్టెన్ నాగరాజు

“సమయంలో గర్భిణీని తరలించడం మా ప్రధాన బాధ్యత. అవసరం వచ్చిన ప్రతిసారి మేము ముందుంటాం.”

102 వాహనాల సమయపాలన మెరుగుపడటంతో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు పెద్ద సాయం అవుతోంది. ప్రస్తుతం ఫిర్యాదులు తీవ్రంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఫాలోఅప్‌ వ్యవస్థ బలపడటంతో కొత్తగా వచ్చే కేసులు కూడా ముందుగానే పర్యవేక్షణలోకి వస్తున్నాయి.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News