ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్
ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్
Komidala Mahender reddy
చిట్యాల ప్రాంతానికి చెందిన సామ కుటుంబానికి చెందిన విద్యార్థి సామ శ్రీ వాస్తావ్ రెడ్డి తన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందాడు. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష–2026లో అతను తెలంగాణ రాష్ట్రంలో 10వ ర్యాంక్ సాధించగా, దేశవ్యాప్తంగా 886వ ర్యాంక్ పొందడం విశేషం.చిట్యాలకు చెందిన సామ ఉపేందర్ రెడ్డి కుమారుడైన శ్రీ వాస్తావ్ రెడ్డి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. క్రమశిక్షణతో చదువుతూ, గురువుల మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా కుటుంబ సభ్యులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో సైనిక్ స్కూల్లో చేరి దేశానికి సేవ చేసే లక్ష్యంతో మరింత కృషి చేస్తానని శ్రీ వాస్తావ్ రెడ్డి తెలిపారు. ఆయన విజయంతో చిట్యాల ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి