Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:45 AM

ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్

ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్

ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్
13-03-2026 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ప్రాంతానికి చెందిన సామ కుటుంబానికి చెందిన విద్యార్థి సామ శ్రీ వాస్తావ్ రెడ్డి తన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందాడు. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష–2026లో అతను తెలంగాణ రాష్ట్రంలో 10వ ర్యాంక్ సాధించగా, దేశవ్యాప్తంగా 886వ ర్యాంక్ పొందడం విశేషం.చిట్యాలకు చెందిన సామ ఉపేందర్ రెడ్డి కుమారుడైన శ్రీ వాస్తావ్ రెడ్డి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. క్రమశిక్షణతో చదువుతూ, గురువుల మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా కుటుంబ సభ్యులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో సైనిక్ స్కూల్‌లో చేరి దేశానికి సేవ చేసే లక్ష్యంతో మరింత కృషి చేస్తానని శ్రీ వాస్తావ్ రెడ్డి తెలిపారు. ఆయన విజయంతో చిట్యాల ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో చిట్యాల యువకుడి ప్రతిభ – తెలంగాణలో 10వ ర్యాంక్

Article Image

చిట్యాల ప్రాంతానికి చెందిన సామ కుటుంబానికి చెందిన విద్యార్థి సామ శ్రీ వాస్తావ్ రెడ్డి తన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందాడు. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష–2026లో అతను తెలంగాణ రాష్ట్రంలో 10వ ర్యాంక్ సాధించగా, దేశవ్యాప్తంగా 886వ ర్యాంక్ పొందడం విశేషం.చిట్యాలకు చెందిన సామ ఉపేందర్ రెడ్డి కుమారుడైన శ్రీ వాస్తావ్ రెడ్డి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. క్రమశిక్షణతో చదువుతూ, గురువుల మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా కుటుంబ సభ్యులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో సైనిక్ స్కూల్‌లో చేరి దేశానికి సేవ చేసే లక్ష్యంతో మరింత కృషి చేస్తానని శ్రీ వాస్తావ్ రెడ్డి తెలిపారు. ఆయన విజయంతో చిట్యాల ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News