ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Sthanikam District Staff Reporter
ఆలేరు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఫైర్ సేఫ్టీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వప్న రాథోడ్ ఆధ్వర్యంలో వైద్యులు,సిబ్బంది,రోగులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరై అగ్ని ప్రమాదాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు,మంటలను నియంత్రించే విధానాలు,ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం,ప్రమాద స్థలం నుండి సురక్షితంగా బయటపడే మార్గాలు,ఇతరులను ఎలా రక్షించాలి వంటి కీలక అంశాలను వివరంగా తెలియజేశారు.అలాగే ప్రాక్టికల్ డెమో ద్వారా మంటలను ఎలా ఆర్పాలో ప్రత్యక్షంగా చూపించారు.ప్రత్యేకంగా ఆసుపత్రి వంటి సున్నిత ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు,ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సిబ్బంది బాధ్యతలు,రోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కే.శ్రీనివాస్,వి.నరేష్,ఏ.మల్లేషం,ఎన్.కర్ణాకర్ చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత పెరగడంతో పాటు,అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో స్పష్టమైన అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి