Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:28 AM

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
17-02-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్.

వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఎన్నిక.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాస్వామ్య పర్వదినాన్ని తలపించే విధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.మొదటగా రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు,ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమణి,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ జగన్మోహన్,సహాయ అధికారి దూడల వెంకటేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరై నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అనంతరం చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్,వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల ప్రకటన అనంతరం సభలో హర్షధ్వానాలు మార్మోగాయి.పార్టీ శ్రేణులు,అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన చైర్‌ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి,పారదర్శక పాలన,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.వైస్ చైర్‌ పర్సన్ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.మొత్తంగా ఆలేరు మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

Sthanikam

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

Article Image

చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్.

వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఎన్నిక.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాస్వామ్య పర్వదినాన్ని తలపించే విధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.మొదటగా రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు,ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమణి,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ జగన్మోహన్,సహాయ అధికారి దూడల వెంకటేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరై నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అనంతరం చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్,వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల ప్రకటన అనంతరం సభలో హర్షధ్వానాలు మార్మోగాయి.పార్టీ శ్రేణులు,అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన చైర్‌ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి,పారదర్శక పాలన,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.వైస్ చైర్‌ పర్సన్ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.మొత్తంగా ఆలేరు మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News