Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
February 17, 2026 01:47 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్.

వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఎన్నిక.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాస్వామ్య పర్వదినాన్ని తలపించే విధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.మొదటగా రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు,ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమణి,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ జగన్మోహన్,సహాయ అధికారి దూడల వెంకటేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరై నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అనంతరం చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్,వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల ప్రకటన అనంతరం సభలో హర్షధ్వానాలు మార్మోగాయి.పార్టీ శ్రేణులు,అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన చైర్‌ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి,పారదర్శక పాలన,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.వైస్ చైర్‌ పర్సన్ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.మొత్తంగా ఆలేరు మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News