Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:39 AM

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
February 17, 2026 01:47 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్.

వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఎన్నిక.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాస్వామ్య పర్వదినాన్ని తలపించే విధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.మొదటగా రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు,ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమణి,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ జగన్మోహన్,సహాయ అధికారి దూడల వెంకటేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరై నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అనంతరం చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్,వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల ప్రకటన అనంతరం సభలో హర్షధ్వానాలు మార్మోగాయి.పార్టీ శ్రేణులు,అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన చైర్‌ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి,పారదర్శక పాలన,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.వైస్ చైర్‌ పర్సన్ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.మొత్తంగా ఆలేరు మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News