Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు
March 28, 2026 09:07 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో ప్రారంభమయ్యే ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు జరిగే మహోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని భావించి, వారికి కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరభద్ర బోర్ వెల్స్ (నారాయణఖేడ్) కు చెందిన జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి మూడు సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ బెంచీలు గుడి వద్దకు చేరుకుని వాటికి పెయింటింగ్ కూడా చేశారు. భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లయ్య, అర్చకులు నాగయ్య స్వామి, ఆలయ సిబ్బంది శేఖర్‌తో పాటు సిద్దప్ప, మొగులప్ప, శ్రీను, నగేష్ మరియు గ్రామ ప్రజలు, భక్తులు దాత వీరన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ఆయనను అభినందించారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు మరియు ఆలయ నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News