Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 10:46 PM

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు
March 28, 2026 09:07 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో ప్రారంభమయ్యే ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు జరిగే మహోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని భావించి, వారికి కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరభద్ర బోర్ వెల్స్ (నారాయణఖేడ్) కు చెందిన జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి మూడు సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ బెంచీలు గుడి వద్దకు చేరుకుని వాటికి పెయింటింగ్ కూడా చేశారు. భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లయ్య, అర్చకులు నాగయ్య స్వామి, ఆలయ సిబ్బంది శేఖర్‌తో పాటు సిద్దప్ప, మొగులప్ప, శ్రీను, నగేష్ మరియు గ్రామ ప్రజలు, భక్తులు దాత వీరన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ఆయనను అభినందించారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు మరియు ఆలయ నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News