ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు
ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో ప్రారంభమయ్యే ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు జరిగే మహోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని భావించి, వారికి కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరభద్ర బోర్ వెల్స్ (నారాయణఖేడ్) కు చెందిన జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి మూడు సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ బెంచీలు గుడి వద్దకు చేరుకుని వాటికి పెయింటింగ్ కూడా చేశారు. భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లయ్య, అర్చకులు నాగయ్య స్వామి, ఆలయ సిబ్బంది శేఖర్తో పాటు సిద్దప్ప, మొగులప్ప, శ్రీను, నగేష్ మరియు గ్రామ ప్రజలు, భక్తులు దాత వీరన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ఆయనను అభినందించారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు మరియు ఆలయ నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి