Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” “నన్ను కాపాడండి.. లేకపోతే నేలకూలుతా!” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:16 PM

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!
16-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆకులో ఆవిర్భవించిన ఆధ్యాత్మికత… ధనోజ చేతివాటంతో సజీవమైన శివరూపం!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కళ్లెం ధనోజ అనే యువ కళాకారిణి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తన అపూర్వ ప్రతిభతో శివభక్తిని చాటుకున్నారు. సాధారణంగా కాగితం, కాన్వాస్‌లపై చిత్రాలు వేయడం చూస్తుంటాం. కానీ ధనోజ మాత్రం ప్రకృతి ప్రసాదమైన రావి ఆకును కాన్వాస్‌గా ఎంచుకుని, అత్యంత సూక్ష్మంగా మహాదేవుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం విశేషం.

రావి ఆకుపై శివుని రూపాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆమె తన కళాత్మక నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి సందర్భాన దేశభక్తి నాయకులు, రాజకీయ ప్రముఖుల చిత్రాలను తన చేతివాటంతో సజీవంగా తీర్చిదిద్దుతూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ధనోజకు ఈ సృజనాత్మక కృషి మరింత గుర్తింపునిచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మహాశివరాత్రి అనేది భక్తి, నియమం, ఆత్మశుద్ధికి ప్రతీక. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణతో శివనామస్మరణ చేస్తూ ఆ మహాశివుని ఆశీర్వాదం పొందాలి. భోళేశంకరుడి కరుణకటాక్షంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

Sthanikam

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!

Article Image

ఆకులో ఆవిర్భవించిన ఆధ్యాత్మికత… ధనోజ చేతివాటంతో సజీవమైన శివరూపం!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కళ్లెం ధనోజ అనే యువ కళాకారిణి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తన అపూర్వ ప్రతిభతో శివభక్తిని చాటుకున్నారు. సాధారణంగా కాగితం, కాన్వాస్‌లపై చిత్రాలు వేయడం చూస్తుంటాం. కానీ ధనోజ మాత్రం ప్రకృతి ప్రసాదమైన రావి ఆకును కాన్వాస్‌గా ఎంచుకుని, అత్యంత సూక్ష్మంగా మహాదేవుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం విశేషం.

రావి ఆకుపై శివుని రూపాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆమె తన కళాత్మక నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి సందర్భాన దేశభక్తి నాయకులు, రాజకీయ ప్రముఖుల చిత్రాలను తన చేతివాటంతో సజీవంగా తీర్చిదిద్దుతూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ధనోజకు ఈ సృజనాత్మక కృషి మరింత గుర్తింపునిచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మహాశివరాత్రి అనేది భక్తి, నియమం, ఆత్మశుద్ధికి ప్రతీక. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణతో శివనామస్మరణ చేస్తూ ఆ మహాశివుని ఆశీర్వాదం పొందాలి. భోళేశంకరుడి కరుణకటాక్షంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News