ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!
ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!
స్థానికం బృందం
ఆకులో ఆవిర్భవించిన ఆధ్యాత్మికత… ధనోజ చేతివాటంతో సజీవమైన శివరూపం!
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కళ్లెం ధనోజ అనే యువ కళాకారిణి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తన అపూర్వ ప్రతిభతో శివభక్తిని చాటుకున్నారు. సాధారణంగా కాగితం, కాన్వాస్లపై చిత్రాలు వేయడం చూస్తుంటాం. కానీ ధనోజ మాత్రం ప్రకృతి ప్రసాదమైన రావి ఆకును కాన్వాస్గా ఎంచుకుని, అత్యంత సూక్ష్మంగా మహాదేవుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం విశేషం.
రావి ఆకుపై శివుని రూపాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆమె తన కళాత్మక నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి సందర్భాన దేశభక్తి నాయకులు, రాజకీయ ప్రముఖుల చిత్రాలను తన చేతివాటంతో సజీవంగా తీర్చిదిద్దుతూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ధనోజకు ఈ సృజనాత్మక కృషి మరింత గుర్తింపునిచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మహాశివరాత్రి అనేది భక్తి, నియమం, ఆత్మశుద్ధికి ప్రతీక. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణతో శివనామస్మరణ చేస్తూ ఆ మహాశివుని ఆశీర్వాదం పొందాలి. భోళేశంకరుడి కరుణకటాక్షంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి