Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:23 PM

అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు

అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు

అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు
December 27, 2025 09:37 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంపూర్ణ అక్షరాస్యతే గ్రామ అభివృద్ధికి పునాది – ప్యారీ బేగం

యాదగిరిగుట్ట స్థానికం ప్రతినిధి

గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్యారీ బేగం పిలుపునిచ్చారు.

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌, వార్డు సభ్యులను గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా చూడాలని, గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా పాలకవర్గం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరుతో చదువుకు దూరం చేయవద్దని హితవు పలికారు.

పాఠశాల కరస్పాండెంట్ షేక్ మంజుబాబ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలై మద్యం, బెట్టింగ్‌లు, అప్పుల ఊబిలో చిక్కుకుని చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నూతన పాలకవర్గం చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ కళ్లెం జుహంగీర్ మాట్లాడుతూ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాశం సంగీత, చల్లూరు ఉప సర్పంచ్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు షేక్ షరీఫ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతన వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News