Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:05 AM

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం
January 10, 2026 08:41 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున భారీగా అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. నమ్మదగిన సమాచారం మేరకు మాసాన్‌పల్లి గ్రామ శివారులోని రాజారం ధాబా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో బీదర్ నుంచి నిజాంసాగర్ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల క్వింటాళ్లు (ఇరవై టన్నులు) పీడీఎస్ బియ్యంతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆ లారీని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించి, సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.అక్రమ బియ్యం రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ వ్యాపారులలో ఆందోళన నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News