Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం పర్యటనని విజయవంతం చేయండి:పల్లె వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 08:17 PM

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి
May 12, 2026 07:13 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూప్రాన్‌పేట్ గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య (57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన ప్యాషన్ ప్లస్ బైక్‌ (ఏపీ 24 ఏబీ 3273)పై పనిమీద హైదరాబాద్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ పరిధిలోని భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఎదుటకు రాగానే ఎదురుగా అకస్మాత్తుగా గుర్తుతెలియని బిచ్చగాడు రోడ్డుమీదికి రావడంతో జంగయ్య బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

బిచ్చగాడికి పలుచోట్ల గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News