అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్ ప్రమాదంలో డ్రైవర్ మృతి
అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్ ప్రమాదంలో డ్రైవర్ మృతి
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్పేట్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూప్రాన్పేట్ గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య (57) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన తన ప్యాషన్ ప్లస్ బైక్ (ఏపీ 24 ఏబీ 3273)పై పనిమీద హైదరాబాద్కు బయలుదేరాడు.
మార్గమధ్యంలో ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూప్రాన్పేట్ పరిధిలోని భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఎదుటకు రాగానే ఎదురుగా అకస్మాత్తుగా గుర్తుతెలియని బిచ్చగాడు రోడ్డుమీదికి రావడంతో జంగయ్య బైక్తో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బిచ్చగాడికి పలుచోట్ల గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి