Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి
12-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూప్రాన్‌పేట్ గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య (57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన ప్యాషన్ ప్లస్ బైక్‌ (ఏపీ 24 ఏబీ 3273)పై పనిమీద హైదరాబాద్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ పరిధిలోని భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఎదుటకు రాగానే ఎదురుగా అకస్మాత్తుగా గుర్తుతెలియని బిచ్చగాడు రోడ్డుమీదికి రావడంతో జంగయ్య బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

బిచ్చగాడికి పలుచోట్ల గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూప్రాన్‌పేట్ గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య (57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన ప్యాషన్ ప్లస్ బైక్‌ (ఏపీ 24 ఏబీ 3273)పై పనిమీద హైదరాబాద్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ పరిధిలోని భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఎదుటకు రాగానే ఎదురుగా అకస్మాత్తుగా గుర్తుతెలియని బిచ్చగాడు రోడ్డుమీదికి రావడంతో జంగయ్య బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

బిచ్చగాడికి పలుచోట్ల గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News