Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:49 PM

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్
17-01-2026 602 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్‌కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్‌ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్‌ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.



Sthanikam

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్‌కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్‌ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్‌ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.



మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News