Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:35 AM

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్
January 17, 2026 09:09 PM 597 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్‌కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్‌ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్‌ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.



మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News