Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్
January 17, 2026 09:09 PM 592 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్‌కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్‌ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్‌ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.



మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News