అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్
అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి