Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం
February 01, 2026 03:05 AM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: సీనియర్ జర్నలిస్ట్ డి.డి. దాసు

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో అక్రమ సంబంధాల విషం మానవ సమాజ సంబంధాలను మొత్తం మంటల్లో కాల్చేసింది. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.మంటల్లో చిక్కుకున్న బాధిత మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కాపాడేందుకు అడ్డువచ్చిన 6 నెలల చిన్నారికి 80% కాలి గాయాలు పాలయ్యాయి. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న పసిపాప జీవన పోరాటం కేతపల్లి గ్రామాన్ని విషాద సముద్రంలో ముంచెత్తింది.అక్రమ సంబంధాల సామాజిక విషం వల్ల కుటుంబ విశ్వాసాలు చిరతిపోవడం, పిల్లల భవిష్యత్తు అంధకారం, గ్రామీణ సమాజంలో అపవాదాలు, హింసాత్మక మానసికత వ్యాప్తి చెందుతున్నాయి. అందుకు ఇదే ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందిత మహిళ లొంగిపోవడంతో విచారణ సులభమైంది. గ్రామస్తులు కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు.మానవ సమాజం మూలం - కుటుంబ బంధాలు. వాటిని విషంతో కాల్చితే అంతా మంటల్లా కాలిపోతుంది. ప్రేమ పేరుతో కుటుంబాలను కోతపెట్టుకునే వారు తమను తాము మొదట కాల్చుకుంటున్నారు. 6 నెలల పసిపాప పోరాటం అందరి మనస్సులో శాశ్వత ముద్ర వేసింది. అక్రమ సంబంధాలు ఒక కుటుంబాన్ని కాకుండా - మానవ సమాజాన్ని మొత్తం నాశనం చేస్తాయి. ఇకనైనా సమాజం కళ్లుతెరిసి మానవ సంబందాలపై, కుటుంబ విలువలపై దృష్టిపెట్టి మనుగడ సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా మంచి విలువలతో కూడిన మానవ జీవనం జరిగి నవసమాజంగా బాగుపడాలని ఆశీద్ధాము.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News