Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సోషల్ మీడియాలో దూషణలపై చర్యలు తీసుకోవాలి. పట్టణ సీఐకి ముదిరాజ్ మహాసభ ఫిర్యాదు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 08:20 PM

అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: ఎస్పీ నరసింహ

అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: ఎస్పీ నరసింహ

అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: ఎస్పీ నరసింహ
May 12, 2026 07:12 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు. పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం తరలింపును నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్టును ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను పరిశీలించారు. చెక్‌పోస్ట్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ముఖ్య ప్రాంతాల్లో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికడుతున్నట్లు చెప్పారు.

వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి రాత్రింబవళ్లు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను రవాణా చేసేటప్పుడు సంబంధిత అనుమతి పత్రాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.

ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్‌పోస్ట్ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News