Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 09:03 PM

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు
March 25, 2026 07:09 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా పోలీసు అధికారి నరసింహతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆరు ఇసుక నిల్వ ప్రాంతాల్లో అక్రమ రవాణా వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేపట్టాలని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ బృందం నిరంతరం ఇసుక నిల్వ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో ఆమోదం పొందిన 729 ఇసుక ట్రాక్టర్లకు గుర్తింపు కోసం రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ మరియు వాహన గుర్తింపు కెమెరాల పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఇసుక రవాణా ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ కోసం ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమతి లేని వాహనాలు గుర్తిస్తే వెంటనే నిరోధించాలని స్పష్టం చేశారు.

తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు ఇసుక నిల్వ ప్రాంతాలను సందర్శించాలని, అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని, గ్రామ పంచాయతీ కార్యదర్శి అవసరాన్ని నిర్ధారించి తహసీల్దార్ పర్యవేక్షణలో నమోదు చేపడతారని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, రెవెన్యూ విభాగాధికారి వేణు మాధవరావు, గనుల శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News