PRINT TIME: May 26, 2026 08:53 PM
అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న పోలీసులు – లారీ స్వాధీనం
అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న పోలీసులు – లారీ స్వాధీనం
March 24, 2026 01:40 PM
152 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
న్యాలకల్ మండలం పరిధిలోని హద్నూర్ మండలంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక లారీని పట్టుకున్నారు. 24-03-2026 తేదీన తెల్లవారుజామున సుమారు 00:30 గంటల సమయంలో హద్నూర్ ఉపనిరీక్షకుడు దోమ సుజిత్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా జహీరాబాద్ నుండి బీదర్ వైపు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టీఎస్ 05 యుసి 7327 నంబరు గల లారీని గుర్తించి ఆపివేశారు. పరిశీలనలో అవసరమైన పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది.దీనితో వెంటనే లారీని స్వాధీనం చేసుకుని హద్నూర్ పోలీసు స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి