అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి ఆర్ఐఓకు డీఎస్ఎఫ్ వినతిపత్రం
అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి ఆర్ఐఓకు డీఎస్ఎఫ్ వినతిపత్రం
Editor Desk
కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్ఐఓ)కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కళాశాలలను గుర్తించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి