ఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కల్యాణ మహోత్సవ ఆహ్వానం
ఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కల్యాణ మహోత్సవ ఆహ్వానం
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సిహెచ్. వేణుగోపాలచార్యులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ, భక్తులందరి సహకారంతో శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.
ఆహ్వాన పత్రిక స్వీకరించిన అనంతరం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఆధ్యాత్మిక శాంతి, ఐక్యతను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కల్యాణ మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి