శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్ను విజయవాడలో జరిగిన ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.
రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఐసా రాష్ట్ర కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పునీత్, సురేష్ నాయక్, పవన్, ప్రభు, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి